

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 28న తెలిపారు. జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వకుల్ జిందల్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సిఐ నూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 25, 27 తేదీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో ఫిబ్రవరి 25న 15మంది, ఫిబ్రవరి 27న 9మంది మద్యం సేవించి, వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. వీరిని విజయనగరం అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపర్చగా, ఎ.జె.ఎఫ్.సి.ఎం. మెజిస్ట్రేట్ శ్రీమతి బి.రమ్య గారు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షలను జరిమానగా విధించారని జిల్లా ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతీరోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ, మద్యం సేవించి, వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నామన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో ఇంత వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 983కేసులు, ఓపెన్ డ్రింకింగు చేస్తూ పట్టుబడిన వారిపై 3,570కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.