Listen to this article

జనం న్యూస్ 3మార్చి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడా గ్రామాల్లో కాలినడకన దాదాపు 20 కి.మీ దూరం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా యువత కు వాలీబాల్ కిట్స్ మరియు టీ షర్ట్స్ పంపిణీ చేసిన ఎఎస్పీ యువత , ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని వెల్లడి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన , కుర్సిగూడ , లింగగూడా, నాయకపు గూడ గ్రామాలను సందర్శించారు. గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఎఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ అన్నారు.పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా యువత కు వాలీబాల్ కిట్లు , టీ షర్ట్ లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శంభురావు అనే బాలుని పరామర్శించి త్వరలో ట్రీట్మెంట్ అయ్యేవిధంగా పోలీస్ శాఖ తరపున చూస్తామని పేర్కొన్నారు. అక్కడ ఉన్న చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించి బిస్కెట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ…యువత మరియు ప్రజలు మావోయిస్ట్ ల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, సహకరిస్తారని తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని, పేర్కొన్నారు. యువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని పేర్కొన్నారు. యువత ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు , చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. విద్య తోనే అభివృద్ది సాధ్యం అని, పిల్లలు , యువత ను వారి తల్లితండ్రులు ఉన్నత చదువులు చదివించాలి అని తెలిపారు. విద్య, వైద్యం గురించి సహకారం కోసం పోలీసులను ఎల్లప్పుడు ఆశ్రయించవచ్చని, తమకు పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
గ్రామం లో నిషేధిత గంజాయి సాగు ను పండించవద్దని అన్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ బుద్దె స్వామి, తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.