

జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బి సూర్యనాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ…
రాష్ట్రంలో సుమారు 20వేల రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచకపోవడంతో ఇబ్బందులను పడుతున్నామని ఆయన అన్నారు.