Listen to this article

జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బి సూర్యనాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ…
రాష్ట్రంలో సుమారు 20వేల రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచకపోవడంతో ఇబ్బందులను పడుతున్నామని ఆయన అన్నారు.