Listen to this article

జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవమును పురస్కరించుకుని అవగాహనా సదస్సును కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి.వి .ఎన్ ఎస్ వర్మ గారు ప్రారంభించారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జులై 11 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవమును జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా జనాభా పెరుగుదలవల్ల కలిగే సమస్యలన్నీ నీరు, వసతి, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరములు తీర్చుట కష్టతరమవుతుందని , ఇదీ ఆర్ధిక అసమానతలకు దారితీస్తుందని, పర్యావరణం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దీనిని నియత్రించుటకు కుటుంబ నియంత్రణ, యువతను శక్తీ వంతం చేయడం ద్వారా, తమ కుటుంబ నిర్మాణంలో పాత్రవహించుట ద్వారా అరికట్టవచ్చునని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి.వి .ఎన్ ఎస్ వర్మ, కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కే సురేష్ బాబు , కళాశాల పాలక వర్గ సభ్యులు శ్రీ సందీప్ లు, వైస్ ప్రిన్సపాల్ కె వి వి బాపి రాజు , కళాశాల విద్యాశాఖాధికారులు డా॥ టి. రవి కుమార్, డా॥ వై. వెంకట్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ ఎం వెంకటేశ్వర రావు, కళాశాల వివిధ విభాగాధి పతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.