Listen to this article

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విశాఖ తీరానికి సమీపంలోని బంగాళాఖాతం సముద్ర జలాల నుంచి ప్రయోగించే క్షిపణి పరీక్షలకు భారత నౌకాదళం నోటిఫికేషనన్ను కేంద్రం మళ్లీ జారీ చేసింది.డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. సుమారు 3,240 కిలోమీటర్ల పరిధిని డేంజర్, నో-ఫ్లై జోన్గా ప్రకటించింది. భద్రతా చర్యల్లో భాగంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, విమానయాన సంస్థలు ఆంక్షలు పాటించాలని అధికారులు సూచించింది.