

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సిసిఈ) హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నుండి ఎకనామిక్స్ విభాగం నుండి సోషియో ఎకానమీ కండిషన్ ఆఫ్ బీడీ వర్కర్స్ ఎట్ బిచ్కుంద మండల్ అనే అంశం, చరిత్ర విభాగం వారి కౌలాస్ పోర్ట్ హిస్టారికల్ మార్వెల్ అనే అంశం ఎంపికై హైదరాబాదులోని ఇందిర ప్రియదర్శిని నాంపల్లి కళాశాలలో నేడు ప్రదర్శించారు. జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ మరియు జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి .యాదగిరి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
