Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం 07 మార్చ్( జనం న్యూస్ ) కొత్తగూడెం లీగల్: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా బి. భవాని నియమితులయ్యారు. కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. సాయిశ్రీ నుండి గురువారం దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి భవాని బాధ్యతలు స్వీకరించారు.ఆమె 2014లో జూనియర్ సివిల్ జడ్జిగా కల్వకుర్తి కోర్టు, అచ్చంపేట ఇన్చార్జి జడ్జిగా,, రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి ల లో పనిచేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కలను బహుకరించారు.