Listen to this article

నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్.. బహుళజాతి విదేశీ జన్యు మార్పిడి విత్తన కంపెనీలను నిషేదించాలి.. పక్ష వాతం వచ్చిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలి.. కంపెనీ మేనేజర్లతో మీటింగ్ పెట్టాలి..పూనెం సాయి మద్దతు.. మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టార్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో A N S రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతు బహుళజాతి విదేశీ మొక్కజొన్న వ్యవసాయం చేసిన రైతులు దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిహేను రోజులుగా మొక్కజొన్న రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు, ప్రభుత్వం స్పందించక పోవడం తో రైతులు గురువారం యోగితనగర్ నుండి పాదయాత్ర గా బయలు దేరి వెంకటాపురం చేరుకున్నారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ పాద యాత్ర ప్రధాన రహదారి మీదుగా సాగింది. వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ కి పలు డిమాండ్స్ కూడిన వినతిపత్రం అందించారు. సింజెంట, హై టెక్, మాన్సెంట, సీపీ వంటి విత్తన కంపెనీలను అడ్డుపెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలను అడ్డుపెట్టుకొని బాండ్ వ్యవసాయం పేరుతో దారుణంగా మోసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కంపెనీ ఇచ్చిన ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ఎకరానికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయిందని రైతులు డిప్యూటీ తహసీల్దార్ ముందు వాపోయారు.ఎకరానికి లక్షా యాబై వేల రూపాయలు నష్టపరిహారం, టన్నుకు అరవై వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటలో పనిచేసిన కూలీలు, రైతులు పక్షవాతం వచ్చి మంచం పట్టినారని వాళ్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కొంతమంది తెలియక పొట్టలు తింటే ఒళ్ళు నొప్పులు, వాపులు రావడం జరుగుతోందని, మొక్కజొన్న పంట తిని చిరుతపల్లి లో 7 దూడలు చనిపోయినట్లు తెలిపారు ప్రజలు త్రివ భయందోళన చెందుతున్నారని తెలిపారు ఈ పాదయాత్రకు గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి మద్దత్తు ప్రకటించారు కొర్స నర్సింహామూర్తి రైతుల ప్రకాశన పోరాటం చేయడం అభినందనీయమని అన్నారుసమస్య పరిష్కారం కాకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాయని ముట్టడి చేస్తామని హెచ్చరించారు రైతులకు న్యాయం చేయాలన్నారు నాయకులు జి ఎస్పీ జిల్లా కార్యనిర్వాహన అధ్యక్షులు పూనెం ప్రతాప్, కుంజా మహేష్,మోడెం నాగరాజు, కంతి వెంకట్ వాజేడు, వెంకటాపురం మండలాల రైతులు పాల్గొన్నారు