Listen to this article

ఏ మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్…
జనం న్యూస్ // మార్చ్ // 11 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణ గ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది కాబ్బటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ ఎ మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విలాసాగర్ గ్రామములో వ్యవసాయ మరియు ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ అవగహన కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు మరియు కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలని, బయటికి వెళ్లి నప్పుడు గొడుగు, టోపీ, తలపాగ, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఉదయం మరియు సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని కూలీలకు సూచించారు. ఎండ వేడిమికి డి హై డ్రె షన్ కాకుండా ఉండడానికి ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలందరికి , ఓ ఆర్ ఎస్ పాకెట్స్ ని పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమములో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ రత్న కుమారి, ఏఎన్ఎం సౌందర్య, మంజుల ఆశా మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు