Listen to this article

నాడు తడ్కల్ మండలానికై ధర్నా చేసిన నాయకులే, నేడు మండల ఏర్పాటుకు విస్మరించారు. నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని ప్రజల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ను నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కంగ్టి పిట్లం రహదారిపై మహా ధర్నా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ప్రజలు మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తడ్కల్ మండల కేంద్రంగా ఏర్పాటుకై 304 జీవోను జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంతో మండల ప్రకటన నిలిచిపోయిందని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పట్లోళ్ల సంజీవరెడ్డి,గతంలో నిరసనలు,ధర్నాలు, నిర్వహించిన వారే, తడ్కల్ పరిసర గ్రామాల వెనుకబాటుకు కారణం అవుతున్నారని ప్రజలు ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్ట మొదలు తడ్కల్ మండలంగా ఏర్పాటు చేస్తామన్న నాయకులు కనిపించకుండా పోయారని నూతన మండల ఏర్పాటు మాటే ఎత్తడం లేదని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న హామీని వెంటనే మండలంగా ప్రకటించి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మాటల ప్రభుత్వమే కానీ,చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీకు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే జీవో నంబర్ 304 ను అమలుపరిచి త్వరితగతీన తడ్కల్ ను నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ప్రాయంలోనే మండలాల విస్తరణలో భాగంగా అమరణ నిరాహార దీక్షలు,రిలే నిరాహార దీక్షలు,నిర్వారదికంగా చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు,యువజన సంఘాలు,మండల ఏర్పాటు అభిమానులు, పరిసర గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.