Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 12/03/25 గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి, గిరిజనులతో కలిసి పాటలకు నృత్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, మహాశివరాత్రి నుండి దాదాపు 15 రోజులు పౌర్ణమి ఉపవాస దీక్షతో జరుపుకునే లింగీ పండుగలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. గిరిజనుల హోలీ లెంగీ పండుగకు ఆహ్వానించబడటం సంతోషకరమని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MLA మదన్ మోహన్ తో కలిసి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గాంధారి మండల మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర బంజార సంగం అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయాకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ & మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు & నాయకులు , కార్యకర్తలు మరియు బంజారా సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.