Listen to this article

జనం న్యూస్ మార్చి 11 నడిగూడెం నడిగూడెం మండల కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడుగా దార్ల సతీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యువ నాయకులు రౌతు కళ్యాణ్, కిషన్ మోర్చా అధ్యక్షుడు మూలం బిక్షం రెడ్డి, మండల కార్యదర్శి నూకపొంగు గురవయ్య, బూత్ అధ్యక్షుడు గంధం గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.