Listen to this article

జనం న్యూస్ మార్చ్ 11 జిల్లా బ్యూరో ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అఖిల్ మహాజన్ ని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు మంగళవారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామాల్లో యువత చెడు వ్యాసనాల బారిన పడకుండా మండల గ్రామ స్థాయిల్లో పోలీసులచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ముక్యంగా ఆదివాసీ గ్రామాల్లో యువత గంజాయి సరఫరాలో దళరుల చేతిలో బలి కాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి నిర్ములించాలని ఎస్పీ ని కోరారు. వీరితో పాటు కళాకారుడు మెస్రం మురళి ఉన్నారు.