

జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జీవో నెంబర్ 30 ప్రకారం పేదల ఇల్లను రెగ్యులర్ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం రామకృష్ణ నగర్లో జరిగిన ప్రజా వైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ… పట్టణా ల్లో పేదలు నివాసం ఉంటున్న ఇళ్లుకి 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలన్నది జీవో సారాంశమన్నారు. గత జీవో 116 మాదిరిగా ఈ జీవోను నీరు గార్చకుండా చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాలని కోరారు.