Listen to this article

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – రమేష్ జి జనం న్యూస్ -మార్చి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరగనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నాగార్జునసాగర్ పట్టణ బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేసిన పోలీసులు, ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ నాయకుడు హీరేకర్ రమేష్ జి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన పోలీసులకు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందని మండిపడ్డారు ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసి బెదిరించిన రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తెలిపారు, ఈ కార్యక్రమంలో హిరేకర్ రమేష్ జి, సభావత్ చంద్రమౌళి, మాజీ పట్టణ అధ్యక్షులు సల్లోజు శేఖరా చారి, మాజీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పిట్టా సైదులు తదితరులు పాల్గొన్నారు.