Listen to this article

జనం న్యూస్ మార్చి 12 కాట్రేని కొన కాట్రేనికోన మండలం స్థానిక పల్లంకుర్రు పంచాయితీ పరిధిలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సాపేవారిపల్లెలో జరిగిన ప్రేరణ కార్యక్రమం పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాశి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రమేష్ నాయుడు మాట్లాడుతూ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్సై జంగా పురుషోత్తం ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థితికి ఎదిగారని, వారి కృషిని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులను కోరారు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఎస్సై దంపతులు సమకూర్చిన 54 పరీక్ష కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరంఎస్సై మాట్లాడుతూ చదువే నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిందని, మీరు కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చదువును కొనసాగించాలని, అది మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్.ఎస్.సత్యనారాయణ, ఎస్.బి.ఎన్.ఎస్. మూర్తి, ఎ.ఎస్.డి.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రసాద్, గెడ్డం ప్రదీప్, వి.ఉదయినీ, ఎస్.సురేష్, టి.సుబ్బారావు, బూల సాగర్, కె.శ్రీనివాసరావు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.