

జనం న్యూస్ మార్చి 12 కాట్రేనికోన కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పాలెపు లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. బుధవారం పల్లం గ్రామంలోని ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె భర్త ధర్మరావును,కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లం సర్పంచ్ మాల్లాడి వీరబాబ్జి, వైకాపా నాయకులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
