Listen to this article

జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ రెండవ వెంచర్ కి సంబంధించి ఫైనల్ కాస్ట్ అధిక వడ్డీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు నివాసితులు గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు ఫోర్త్ ఫేస్ రెండవ వెంచర్ లోని ఫ్లాట్స్ కు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఫైనల్ కాస్ట్ విషయంలో అధికంగా రేటు నిర్ణయిస్తున్నారని వడ్డీ సైతం అధికంగా వేస్తూ తమను ఆందోళనకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని రమేష్ కి వారు విజ్ఞాపన పత్రం అందజేశారు దీనిపై రమేష్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను మంత్రి దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు హామీ ఇచ్చారు దీంతో నివాసితులు హర్షం వ్యక్తం చేశారు