Listen to this article

జనం న్యూస్. మార్చి 14. సంగారెడ్డి జిల్లా. ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. స్వయంగా పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.ఈ రంగుల పండుగ హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని వారు సూచించారు. బలవంతపు రంగులు పూయడం, మద్యం తాగి, వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మద్యం సేవించి చెరువులు, కుంటలకు వెళ్లరాదని, జలాశయాల వద్ద లోతట్టు ప్రాంతాలలో తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.