Listen to this article

జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బాధిత మహిళలు మరియు పిల్లలకి అండగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందది జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ తెలియజేశారు. లైంగిక దాడికి గురైన మహిళలకు మరియు బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేయడం జరుగుతుంది. తెలిపారు ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ను బాధిత మహిళలైన ఆరుగురికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 6 చెక్కులను, (మొత్తం 60,000 రూపాయలు) సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ అందించారు. కేసులలో బాధిత మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. 161 cr.p.c/180 బిఎన్ఎస్ఎస్,164 cr.p.c/ 183 BNSS statement రికార్డింగ్లో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా బాధితులకు అండగా ఉండడం జరిగింది. భరోసా ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భరోసా సెంటర్ ద్వారా పోలీస్ సేవలు, కౌన్సిలింగ్, వైద్య మరియు న్యాయ సేవలు అందించడం జరుగుతుంది . భరోసా సెంటర్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో మహిళలకు మరియు చిన్న పిల్లలకు బాధింపబడినట్లైతే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే 8712670561 నెంబర్ లేదా డయల్ 100 ద్వారా భరోసా కేంద్రాన్ని సంప్రదించగలరని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా సెంటర్ ఇంచార్జ్ మహిళా ఎస్సై తిరుమల, లీగల్ సపోర్ట్ పర్సన్ శైలజ, డిసిఆర్బి డి.ఎస్.పి కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డి.సి.ఆర్.బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్.ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ లు పాల్గొన్నారు.