

జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా దీనికోసం విధివిధనాలు సిద్ధం చేసినట్లు సమాచారం.మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 29 లక్షల మందికి ఎటువంటి భూమి లేదు.
ఇందులో ఒకరోజు పనిచేసిన వారు 15 లక్షలు ఉండగా, 10 రోజులు పనిచేసిన వారు 10 లక్షలు ఉన్నారు.వీరిని మినహాయించి కనీసం 20 రోజులు పైన పనిచేసిన వారు 10 లక్షలు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.12,000 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం.దీనికి గాను ఏడాదికి రూ.1200 కోట్లు వెచ్చించనున్న తెలంగాణ ప్రభుత్వం.