

బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాజుల చౌరస్తా నుండి గణేష్ మందిర్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గారిని శాలువతో సన్మానం చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున సెట్ కార్ ,బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్. డెలికేట్ విఠల్ రెడ్డి, బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ రమేష్ సెట్ కార్, పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, నౌషా నాయక్, సంజు పటేల్, పోతుల లింగురాం, సాయినాథ్, మైనార్టీ నాయకుడు గౌస్ సెట్, కలీం, గుండెకల్లు రాజు పటేల్, బొగడ మీద సాయిలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
