

జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. మంత్రి సీతక్క తో పాటు పార్టీని గత ఎన్నికల సమయంలో జిల్లా పరిశీలకుడిగా పనిచేసిన సత్తు మల్లేష్ లపై శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వప్రసాద్ టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కాగా ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు బలంగా ఉన్నాయి. సిర్పూర్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ సహా ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి శ్యామ్ నాయక్ తదితరులు విశ్వప్రసాద్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ పై కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని ఆ వర్గం ఆరోపిస్తుంది. తాజాగా శ్రీనివాస్ కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశం అవుతుంది. తాజా పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.