

విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ఏరకంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తారు- ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారామ్ మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్ జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం అత్యల్పంగా 7.5% నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాని ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారామ్ తీవ్రంగా ఖండించారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులను చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్తున్నారన సమాచారంతో స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, ట్రైనీ ఎస్సై గోపాల్ రెడ్డి తన సిబ్బందితో ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించగా, స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏఐఎస్ఎఫ్ నాయకులకు సీతారాం సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్న చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని అన్నారు. విద్యార్థి లోకానికి ఒరిగిందేమీ లేదన్నారు,రాష్ట్ర విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ఏరకంగా కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తారని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు ఉద్యమాలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ముందస్తుగానే పోలీసులని ఉపయోగించి అరెస్టు చేస్తున్నారని,అయినా విద్యార్థి ఉద్యమాలను ఏ పోలీసులు లాఠీలు అరెస్టులు కేసులు భయపెట్టలేవని అన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యా రంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్కే ముస్తఫా, కార్యదర్శి జి బుచ్చిబాబు, రుద్ర యశ్వంత్ తదితరులు ఉన్నారు.