Listen to this article

50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయాలి

పెండింగ్ కమిషన్ బకాయిలు ఐకెపి కేంద్రాలకు చెల్లించేలా చర్యలు

వృద్ధాప్య ఫించన్ దారులు మరణిస్తే కుటుంబంలో మరొకరికి ఫించన్ మంజూరు వెంటనే చేపట్టాలి

స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి

సెర్ఫ్ కార్యక్రమాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పంచాయతీ కార్యదర్శి

జనం న్యూస్ , మార్చి 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

సెర్ఫ్ క్రింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్ అన్నారు.గురువారం రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్ సెర్ఫ్ కార్యక్రమాల పై సెర్ఫ్ సీఈఓ డి.దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్ మాట్లాడుతూ, యాసంగి మార్కెటింగ్ సీజన్ లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33% ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. జిల్లాలలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపి లకు బదిలీ చేయాలని, అదనపు వారి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్ లకు తెలిపారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని అన్నారు.నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళ సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమిషన్ మహిళా సంఘాలకు అందడం లేదని దీని పై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమిషన్ చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో గోదాముల నిర్మాణానికి సంకల్పించారని, ప్రస్తుతం ఏ మండలాల్లో గోడౌన్లు లేవు గుర్తించి అక్కడ మహిళా సంఘాల ద్వారా గోడౌన్ నిర్మించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. స్వశక్తి మహిళా సంఘాలచే రైస్ మిల్లుల ఏర్పాటు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ , సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు.దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. నూతన దరఖాస్తులలో రీన్యూవల్స్ కు ప్రాధాన్యతగా షెడ్యూల్ చేయాలని అన్నారు. నిర్ధారణ క్యాంపు ల నిర్వహణ కోసం ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. డిఆర్డిఓ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.3 నెలలు ఫించన్ తీసుకొని లబ్దిదారుల వలస వెళ్లినట్లు షిష్టం నమోదు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం మన దగ్గర 2 లక్షల 55 వేల 262 లబ్దిదారుల వలస వెళ్లినట్లు ఉందని, ఈ వివరాలను అధికారులు రివ్యూ చేసుకొని పెన్షన్ తీసుకోక పోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని, లబ్ధిదారులు మరణిస్తే వివరాలను అప్ డేట్ చేయాలని అన్నారు.ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వశక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి స్కూల్ యూనిఫాం కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని అన్నారు. స్కూల్ యూనిఫాం కుట్టు పనులకు సంబంధించి అవసరమైన కటింగ్ మిషన్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని, మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా చూడాలని , జూన్ నెల వరకు ఈ పనులు పూర్తి కావాలని అన్నారు. స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు సంబంధించి కూలీ క్రింద 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు రివ్యూ చేసి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందని అన్నారు.స్వశక్తి మహిళ సంఘాల ద్వారా సృష్టించబడిన స్విచ్చింగ్ సెంటర్ లు పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్ కుట్టిన తర్వాత ప్రైవేట్ గా కూడా కుట్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్లౌజ్, పెటికోట్ కుట్టడం వంటి ఆర్డర్ తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని ఆయన అధికారులకు తెలిపారు. మహిళల చేపట్టే పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న చిన్న హోటల్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని అన్నారు. మహిళా శక్తి మాల్స్ ఏర్పాటు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు.గ్రామీణ సెల్ఫ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కు అనువైన స్థలాల ఎంపిక చేయాలని , అనువైన స్థలం ఎంపిక చేసిన వెంటనే ఎన్.ఆర్.ఐ.టి నుంచి 50 లక్షల రూపాయల గ్రాంట్ వస్తుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంక్ లను మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్ లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సహాయం అందేలా చూడాలని అన్నారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద బీమా, సాధారణ భీమా అమలు అవుతుంది పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు సహాయం అందజేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో సుల్తానాబాద్, మంథని రహదారి వద్ద మహిళా సంఘాలచే పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్థల ఎంపిక చేసి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆర్ ఎస్ ఈ టి వై ట్రైనింగ్ సెంటర్ త్వరగా ఏర్పాటు చేయాలని,లోన్ బీమా,ప్రమాద బీమా క్లెయిమ్స్ తొందరగా పంపించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ ఎం. కాళిందిని, అడిషనల్ డి ఆర్ డి ఓ రవికుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.