

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు జయనగరం పట్టణం గోకపేటకు చెందిన కంది సన్యాసిరావు అలియాస్ సిద్ధు (19సం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,500/-లు జరిమానా విధిస్తూ మార్చి 28న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ మార్చి 28న తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణానికి చెందిన 16 సంవత్సరాల బాలికతో విజయనగరం పట్టణం గోకపేటకి చెందిన నిందితుడు కంది సన్యాసిరావు అలియాస్ సిద్దు (19సం||లు) అనే వ్యక్తి ఫేస్బుక్ లో పరిచయం ఏర్పరుచుకొని, ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తరచూ తన ఇంటికి తీసుకువెళ్ళి బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లు, గర్భవతిని చేసి, పెండ్లికి నిరాకరించి మోసం చేసినట్లుగా విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ బి.స్వర్ణలత పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి దిశా మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా మహిళా పిఎస్ సిఐ ఇ.నర్సింహమూర్తి చర్యలు చేపట్టగా, నిందితుడు కంది సన్యాసిరావు అలియాస్ సిద్ధు (19సం||లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడి, గర్భవతిని చేసినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె. నాగమణి గారు నిందితుడికిq 20సం.లు కఠిన కారాగారం మరియు రూ.10,500/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎన్ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.2లక్షల నష్ట పరిహారంను మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నేరం నిరూపణ అయ్యే
విధంగా పోలీసువారి తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నర్సింహమూర్తి పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ జి.ఎస్.నాయుడు, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్.రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసువారి తరుపున వాదనలు వినిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానారావు, ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు అభినందించారు.