Listen to this article

జనం న్యూస్ మార్చి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి పంచాంగ శ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుందని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండుతాయని ఆహార ధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి ఏం శెట్టి ప్రభాకర్ నల్లెల్ల విజేందర్ గాదే రాజేందర్ బసాని చంద్రమౌళి దిండుగాల వంశీ బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….