

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి
పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ కానుకగా పేద ప్రజల కోసం ఉగాది నాడు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేటి నుండి ప్రతి నియోజకవర్గoలో ఎమ్మెల్యేలు, అధికారులచే రేషన్ షాపు నందు సన్న బియ్యం పంపిణీ నిర్వహించారు ఇందులో భాగంగా గద్వాల పట్టణంలో 35, 26 వార్డ్ లో రేషన్ షాప్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ , అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ , నాయకులు, కార్యకర్తలు రేషన్ డీలర్లు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా పేద ప్రజలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ … గతంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పేద ప్రజల ఆకలిని తీర్చాలని ప్రతి ఒక్కరూ పేదవారు కూడా కడుపునిండా అన్నం తినాలని దూర దృష్టితో ఆలోచించి రేషన్ షాపు ద్వారా రెండు రూపాయలకే బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వారు కూడా అదేవిధంగా పేద ప్రజలకు బియ్యమును పంపిణీ చేయడం జరిగింది. కానీ నేడు ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం నేతృత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా చారిత్రాత్మకమైన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కడుపునిండ అన్నం తిని ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వమే రైతుల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేసి బియ్యముగా తయారుచేసి రేషన్ షాపుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు నందు ఉన్న షాపు నందు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పేర్కొన్నారు. మార్కెట్లో సన్న బియ్యం కొనాలంటే కిలో 40 రూపాయలు ప్రభుత్వం ఎంత కష్టమైనా పేద ప్రజల ఆకలి తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ బియ్యాన్ని మీ కుటుంబ సభ్యులతో సద్వినియోగం చేసుకోవాలి విక్రయ దారులకు బియ్యము బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినవారు అవుతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు త్వరలోనే ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల ఆకలి తీర్చాలన్న దృష్టిలో ఉంచుకొని ఉగాది పండుగ కానుకగా సీఎం గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క పేదవారికి ఉచితంగా సన్న బియ్యం రేషన్ షాపులో పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ బియ్యం రేషన్ షాపు ద్వారా తీసుకువెళ్లి మీ కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలి దీనిని తప్పు దారిని పట్టించే విధంగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేయరాదు అని సూచించారు.ప్రభుత్వం పేద ప్రజల ఉద్దేశిం చుకుని ఎంత కష్టమైనా పేద ప్రజల ఆకలి తీర్చాలని ముఖ్య లక్ష్యంతో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.