Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)

నేడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న బిజెపి పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మరియు నియోజవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ప్రజా సేవకు అంకితుడై మరిన్ని సేవలు ప్రజలకు అందించాలని వారు ఉన్నత స్థాయిలో నిలవాలని వీరన్న చౌదరి ఆకాంక్షించారు.. అనంతరం ఈరోజు సోము వీర్రాజు ఇంటి నుండి పెద్ద ఎత్తున ర్యాలీ తో బయలుదేరి రాష్ట్ర రాజధాని అమరావతి లో ప్రమాణ స్వీకరానికి చేసున్న సందర్భంగా రాజనగరం నియోజవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు