

బిచ్కుంద ఏప్రిల్ 2:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కథ గావ్ గ్రామంలో బుధవారం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ కాంగ్రెస్ నాయకుల తో కలిసి ప్రారంభించారు. రేషన్ డీలర్ తో కలిసి లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినందుకు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు పటేల్ కాశీనాథ్ శంకర్ డీలర్ భూషణ్ సచిన్ రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు