Listen to this article

ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం సరఫరా

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్

జనం న్యూస్ , ఏప్రిల్ 05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.శుక్రవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండలంలోని కటికెనపల్లి, మేడారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి పర్యటించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ప్రజలంతా మంచి భోజనం చేయాలనే సంకల్పంతో సన్న బియ్యం సరఫరా ప్రారంభించడం జరిగిందని, ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మేడారం గ్రామంలో అవసరమైన రోడ్డు, డ్రైయిన్ వంటి మౌలిక వస్తువులు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందే విధంగా తాను స్వయంగా బాధ్యత తీసుకుంటున్నానని ప్రభుత్వ విప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రేషన్ షాపులలో తెల్ల కార్డు దారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ధర్మారం మండలంలో 2 వేల 300 మంది రైతులకు వానాకాలంలో 7 కోట్ల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుత యాసంగి సీజన్ లోను అదే విధంగా ఎటువంటి కోతలు లేకుండా బోనస్ చెల్లించి సన్న వడ్లు కొనుగోలు చేస్తామని అన్నారు. ధర్మారం మండలంలో 36 వేల సిలిండర్ లను 500 రూపాయలకే రూ.7 కోట్ల సబ్సిడీ భరించి సరఫరా చేసామని అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీ లో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లను ఆదేశించారు. ప్రజల కూడా ప్రభుత్వ అందిస్తున్న సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, తహసిల్దార్ వకీల్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.