Listen to this article

శాసనసభ్యులు బోనెల విజయచంద్ర

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్5, (రిపోర్టర్ ప్రభాకర్)‎

:ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన, అట్టడుగు వర్గాల కొరకు పోరాటం చేసిన మహా వ్యక్తి అని ప్రసంశించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయలని, ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని తరుణమిది అని తెలిపారు. 28 ఏళ్ల వయసులో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందని అన్నారు. జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, కమ్యూనికేషన్లు, రక్షణ మంత్రిత్వ శాఖలతో సహా ముఖ్యమైన పదవులను చేపట్టి, దేశంలో పలు మార్పులకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆయన నాయకత్వంలో దేశ విధానాలు, పాలనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా రెండుసార్లు చేపట్టి తన హరిత విప్లవానికి నాంధి పలికారని కితాబిచ్చారు. ఆయన వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు నేటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 1974 ఏర్పడిన ఆహార సంక్షోభం సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారని తెలిపారు. దళిత హక్కుల కోసమే కాదు, మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొని, అందరినీ చైతన్యపరిచేవారని చెప్పారు. చరిత్ర గురించి తెలిసిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారని, స్వాతంత్ర సమరయోధులను, పోరాట యోధులను మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మనందరం అటువంటి మహానుభావుల వారి ఆశయాల దిశగా అడుగులు వేయాలని, వారి అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ‎
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.డీ. గయాజుద్దీన్, మునిసిపల్ కమిషనర్ సిహెచ్.వెంకటేశ్వర్లు, బలిజిపేట మండలం యం.ఈ.ఓ ఎస్.సింహాచలం, మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు జి.గంగారాజు, ప్రెసిడెంట్ కె. సల్మాన్, సెక్రటరీ బి.రవికుమార్, రాష్ట్ర నాయకుడు పి. నారాయణరావు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జి.ప్రభాకరరావు సభ్యులు ఎన్.ప్రసాద్,ఆర్. వినయ్, కె.మౌస, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.