

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జీడి లక్ష్మి కుటుంబాన్ని, పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి , 15వ వార్డు కాంగ్రెస్ నాయకులు పాతకాల అనిల్, మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. జీడి లక్ష్మి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం సంతోషంగా ఉందని వార్డు ప్రజల సంక్షేమమే, తన లక్ష్యమని రాబోయే రోజుల్లో వార్డు ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలపై స్పందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైస రమేష్,పాతకాల అనిల్, బాణాల సుధాకర్, కిషన్, కమలాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.