Listen to this article

జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో శనివారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ ట్రేజరి సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా ఎన్నికలలో ప్రెసిడెంట్‌గా డి.నవీన్‌ చంద్‌ , అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ గా పి.సురేష్‌ కుమార్‌, జిల్లా సెక్రటరీ గా కె.వి.ఎస్‌.ఎస్‌. సింధూర, వైస్‌ ప్రెసీడెంట్లుగా ఎస్‌.దివ్య భారతి, పి. సంతోష్‌ కుమార్‌, వై. కామినాయుడు,, బి.వి.ఎస్‌.ఏం. నాయుడు , జాయింట్‌ సెక్రెటరీలుగా వి.సరస్వతమ్మ, టి. అనిల్‌ , ఎస్‌.రంజిత్‌ కుమార్‌ , ట్రేజరర్‌ గా జి.ప్రశాంత్‌ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.ఈ ఎన్నికలకు ఎలక్షన్‌ ఆఫీసర్‌గా పి.కిరణ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ గా ఎస్‌. భాస్కర్‌, ఎలక్షన్‌ అబ్సర్వర్‌గా డి.రమణ రెడ్డి వ్యవహరించారు