Listen to this article

జనం న్యూస్ 07 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం లో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భజంత్రీలు వేదమంత్రాలు ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఎంతో కమనీయంగా వేద పండితులు తో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలని గిరీష్ పంతులు ప్రార్థించడం జరిగింది. తీర్థ ప్రసాదాలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.