Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం

మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో కొంతమంది వ్యక్తులు గ్రామ వీధులు, సీసీ రోడ్లు, గ్రామంలోని చేతిపంపులను, సైడ్ కాలువలను ఆక్రమించుకుంటున్నారని గ్రామపంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ కు గ్రామ ప్రజలు విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇట్టి విషయంపై పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.