Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.

బలహీన వర్గాల కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు నిష్పాక్షికంగా అందించడమే మహాత్మ జ్యోతిరావు పూలే కి మన మందించే నిజమైన జయంతి కానుక అని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సీనియర్ బీ.సీ నాయకులు ఉప్పుటూరి అనిల్ కుమార్ అధ్యక్షతన ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. అనంతరం గడియార స్తంభం సెంటర్లో గల పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి జయంతి జేజేలు పలికారు. ఈ సందర్భంగా ఉప్పుటూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బలహీన వర్గాలకు చెందిన వారైనప్పటికీ ప్రభుత్వ ఫలాలు ఫలితాలలో సరైన న్యాయం, సమన్యాయం జరగటం లేదని అందుకు కారణం కులగణన జరగకపోవడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని విషయాలలో అన్యాయమే జరుగుతుందని దానికి పరిష్కార మార్గం బిసి జనగణన చేపట్టడం ఒక్కటే మార్గమని రాహుల్ గాంధీ భావించి బిసి కులగణన కోసం ఓబీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీద పోరాటం చేస్తున్నారని అన్నారు. దేశభక్తితో జనగణమన పాడే ప్రతి భారతీయుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన కోసం పోరాడాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ ల కులగణన జరిపి వారి ప్రయోజనాలు కాపాడుతున్నట్లే ఓబీసీ కులగణన కూడా చేపట్టి వారికి కూడా సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కులగణన చేపట్టడంలో అభ్యంతరం ఏమిటో తెలియజెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్డీఏ కూటమి పాలకులను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన న్యాయం చేసే ప్రయత్నం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బి.సి జనగణన చేపట్టి ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని కేవలం జయంతి రోజు విగ్రహాలకు పూలమాలలు వేయడం జేజేలు పలకడంతో పూలే గారి ఆత్మ శాంతించదని అన్నారు. పూలే ఏ వర్గాల సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం పోరాడారో ఆ వర్గాలకు న్యాయం చేయడమే వారి కందించే ఘనమైన నిజమైన నివాళి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ నసురుద్దీన్ పల్నాడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చే రెడ్డి రామిరెడ్డి చిలకలూరిపేట రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దాలి శ్రీనివాసరావు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ చిలకలూరిపేట మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు షేక్ ఖాజాబుడే బీసీ నాయకులు కొండెబోయిన శ్రీనివాసరావు మేకపోతుల రవి అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు మార్టూరు శ్రీనివాసరావు కుంచాల ఆంజనేయులు, కోవూరి రాజా, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ఏడు కొండలు పెదలంక వెంకటేశ్వర్లు కాళంగి శ్రీనివాసరావు మదర్ తెరిసా ఆటో రిక్షా యూనియన్ నాయకులు రాజు వారి మిత్ర బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు యప్పాల అంజిరెడ్డి మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు, రెడ్డెం నర్సిరెడ్డి మైనారిటీ నాయకులు షేక్ , షేక్ మహమ్మద్ రఫీ, షేక్ షేర్ హసన్ షేక్ బుడ్లే సాహెబ్ సయ్యద్ ఖాజా, జంగాలపల్లి రామకృష్ణ డి పుల్లయ్య పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.