Listen to this article

జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి.

భారత ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ & రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మార్గదర్శకత్వంలో, అలాగే చైర్మన్ భూరియా జీ, వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కన్వీనర్ రాహుల్ బాల్ నేతృత్వంలో భారత ఆదివాసి కాంగ్రెస్ శిక్షణ సందర్భంగా ఈరోజు జరుపుల గోవింద్ నాయక్. నిజాంబాద్ జిల్లాలోని రెండు గిరిజన ప్రాంతాలను సందర్శించారు. గ్రామస్థుల తో పరస్పర చర్చలు
జరుపుల గోవింద్ నాయక్. పంది మడుగు గ్రామపంచాయతీ సందర్శించి మాజీ సర్పంచ్ గంగ నరసయ్య, ఉపసర్పంచ్ మోహన్, ధూమ నాయక్ & వి డి సి.సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులతో సమావేశమయ్యారు.
గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగ పరిరక్షణలో పార్టీ విధానాన్ని వివరించారు, తద్వారా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అంగన్వాడి కేంద్రం సందర్శన.
గ్రామంలోని అంగన్వాడి స్కూల్ ను పరిశీలించి, పిల్లల విద్యా పరిస్థితులు, అందిస్తున్న పౌష్టికాహారం విషయాలపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ సహాయం ఎలా మరింత మెరుగుపరచవచ్చో గ్రామస్థులతో చర్చించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ స్థితిగతుల పరిశీలన ఆర్వో వాటర్ ప్లాంట్ పనితీరు సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించారు. నిజాంబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి స్పెషల్ ఆఫీసర్ కు సమస్యను వివరించగా, ఆయన తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చరు.