Listen to this article

తల్లిపాల ప్రాముఖ్యత పోషక విలువలు.

పోషణ-పక్షం కార్యక్రమంతో పిల్లలకు బాలింతలకు పిల్ల తల్లులకు గర్భిణీలకు అవగాహన కార్యక్రమం

అంగన్వాడి టీచర్ సుకినే మాలతి

జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

పిల్లలు పోషకాహారం తింటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు అంగన్వాడీ టీచర్స్ సుకినే మాలతి ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ. పౌష్టికాహారం పిల్లలు మరియు బాలింతలకు 1000 ప్రాముఖ్యతను తెలియ చేసామని తల్లిపాలు ప్రాముఖ్యత 6 నెలలు దాటిన పిల్లలు పోషకాహారం తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోషణ పక్షం చిత్రపటం వేసి అంగన్వాడి పిల్లలకు మరియు బాలింతలకు పిల్ల తల్లులకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.