Listen to this article

ఆలయ చైర్మన్ అప్పారావు.

జనం న్యూస్,ఏప్రిల్ 11,జూలూరుపాడు:మండల

పరిధిలోని కాకర్ల గ్రామంలో కొలువై ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి పరిశీలించినట్లయితే సుమారుగా 1965 – 66 వ సంవత్సరాలలో చావా రామయ్య అనే హనుమంతుని భక్తుడు చిన్న పందిరి వేసి స్వామి వారికి గుడి తయారు చేసి పూజా కార్యక్రమాలు చేసేవారు ఆ తర్వాత చలువాది రామయ్య, నంగునూరు వెంకటేశ్వర్లు అనువారు షావుకార్లు కాబట్టి వ్యాపారాలు చేస్తూ ఉండేవారు ఆ నాటి సీఎం జలగం వెంగళరావు ఉన్న రోజుల్లో దేవాలయ దేవాదాయ శాఖ నుండి సుమారు ఒక 10,000 (పది వేల)రూపాయలు గుడి కట్టించుకొనుటకు సహకారంతో కాకర్ల శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం ఇవ్వడమైనది వాటితోపాటు గ్రామంలోని కొందరు దాతలు మరియు వేరే గ్రామాలలోని దాతల సహకారంతో స్వామివారి గుడిని నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లోనే చల్లా నారాయణ అనుభక్తుడు స్వామివారి భజనలు చేసేవారు శ్రీరామనవమికి స్వామివారి కల్యాణము నిర్వహించేవారు. తరువాత ఉడత మోహన్ రావు, వెంకటేశ్వర్లు అనుభక్తులు స్వామివారి కార్యక్రమాలు సుమారు 25 నుండి 30 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలో స్వామివారి కార్యక్రమాలు నిర్వహించటం జరిగినది. ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్యా కారణాలవల్ల ఆలయ అభివృద్ధి కుంటుబడింది. ఇదే సమయంలో కాకర్ల గ్రామంలో గత సంవత్సర కాలంగా కళ్యాణం అప్పారావు స్వామివారి భక్తుడు గుడికి సంబంధించిన పెండింగ్ పనులు అన్నిటిని తను, తనతోపాటు కొంతమంది యువకులను కలుపుకొని వారిద్వారా స్వామి గుడికి సంబంధించిన అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయుటకు నడుం బిగించి తన భక్తి మాటల ద్వారా చందాలు వసూలు చేసి స్వామివారి గుడి సంపూర్ణ నిర్మాణానికి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చినాడు కాకర్ల ఆంజనేయ స్వామి వారి గుడి నిర్వాహణ ఖర్చుల కోసం గతంలోని గుండెపుడి దొరవారైన ఉమామహేశ్వరరావు సుమారుగా రెండు ఎకరముల భూమిని దానంగా ఇవ్వడమైనది దానితోపాటు గ్రామంలో ప్రస్తుతం నిర్మించబడి ఉన్న ఆంజనేయ స్వామి గుడికి స్థలాన్ని ఆయనే ఉచితంగా ఆనాడు ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి గుడి చైర్మన్ మాట్లాడుతూ ఎవరైనా మనల్ని తిట్టినా పొగిడినా నిందించిన కాలమే వారి కార్యానుసారం వారికి సమాధానం చెబుతుంది పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా పెద్దదైన అది మనలోని శక్తిని మేల్కొల్పుతుంది సహాయాన్ని చేయాలి అని అనుకుంటేనే హృదయం ఎంతో ఉల్లాసంగా తయారవుతుంది శత్రువు కైనా ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుకోవాలి దీనివలన మనిషిలోని ఈర్ష ద్వేషం తొలగిపోయి ప్రేమ తత్వం అలవడుతుంది ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా మంచే జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలనకాదు ఇతరుల మంచిని కోరుకున్న వాడి బాగోగులు స్వయంగా పరమేశ్వరుడే చూసుకుంటాడు కాబట్టి అందరి మంచిని కోరుకుందాం అని అన్నారు. చైర్మన్ అప్పారావు భక్తులకు ఇచ్చే సందేశం గుడి అభివృద్ధికి సహకరించిన దాతలకు నాతో పాటు ఉండి నాకు సహాయ సహకారాలు అందించిన నా తోటి భక్తులకు గ్రామ ప్రజలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.