Listen to this article

బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలో కాటేపల్లి తాండకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు తన ఇంటి వద్ద గంజాయి సాగును చేస్తూ గంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు అట్టి రెండు ఇళ్ళలో మరియు ఇంటి ఆవరణలో తనిఖీలు చేయగా ఒకరి ఇంటి వద్ద అతని పేరు భామన్ మధు సింగ్ తండ్రి అమర్ సింగ్ ఇంటికి పోయి చూడగా అతను పారిపోయి ఉన్నాడు అతని ఇంటి ముందు ఆవరణలో 16 గంజాయి మొక్కలను కనుగొని వాటిని పీకి వేసి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడమైనది. మరియు రెండో ఇల్లు అయినా బర్ధ వార్ రాయిలా తండ్రి భవన్యాసింగ్ ఇతని ఇంటిలో తనిఖీ చేయగా 200 గ్రాముల ఎండు గంజాయి లభించినది మరియు ఇతని ఇంటి ఆవరణలో 46 గంజాయి మొక్కలను పెంచినవి కనుగొన్నాము ఈ గంజాయి మొక్కలు కనబడకుండా చుట్టూరా తడకలతో అల్లి పెట్టుకున్నారు ఈ గంజాయి అమ్మడం గంజాయి కలిగి ఉండడం గంజాయి మొక్కలను పెంచడం గంజాయి రవాణా చేయడం ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున వీరిద్దరి నేరస్తులపై కేసు నమోదు చేసి బర్ధ వార్ రాయిల అనే వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేయగా కోర్టు జడ్జి నిజాంబాద్ జైలుకు 14 రోజులు రిమాండ్కు పంపించారు. పారిపోయిన వ్యక్తి మధు సింగ్ ను త్వరలో అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేస్తామని సిఐ సత్యనారాయణ తెలిపారు