

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ఇవాళ నందలూరు మండలంలో చనిపోయిన వారి మృతదేహాల అవసరార్థం మరియొక బాడీ ఫ్రీజర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు మాట్లాడుతూ.బాడీ ఫ్రీజర్ల అవసరం రాకుండా ప్రజలు ఆయు ప్రమాణాలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏదైతేనేం ఇది ఒక మంచి పని అయినప్పటికీ ఫ్రీజర్ అవసరం రాకుండా ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారు. వీటితోపాటు వైకుంఠ రథం సేవలను కూడా అందుబాటులోకి తెచ్చిన కుర్రా మణి యాదవ్ ను అభినందించారు
లయన్ మన్నెం రామమోహన్.SI మాట్లాడుతూ మండలంలో చనిపోయిన వారి అవసరార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏర్పాటుచేసిన బాడీ ఫ్రీజర్ తో నాలుగు అందుబాటులో ఉంచడం కుర్రా మణి యాదవ్ సేవకు తార్కాణమని ఇలాంటి సేవలు మరెన్నో నిర్వ హించడానికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని, ఇప్పుడు ఏర్పాటు చేసిన బాడీ ఫ్రీజర్ లో HD ప్రసాద్ కొంత ఆర్థిక భాగస్వామి అయ్యారని ఈ సందర్భంగా అభి నందిస్తూ.వారిని సత్కరించటం జరిగింది. యంబులూరు ప్రదీప్ మాట్లాడుతూ.ఇప్పటికే మానవతా సేవ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారని.వీటితోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు అనంతరం మండల నాయకులు పోతురాజు మస్తానయ్య ఆకస్మిక మృతి చెందటం చాలా బాధా కరమని, మస్తానయ్య చేసిన ఎన్నో పోరాటాలను గుర్తుచేసుకొని ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడుకుర్రా మణి యాదవ్, మోడపోతుల రాము, ఉప్పు శెట్టి సుధీర్, గంధం గంగాధర్, HD. ప్రసాద్, గండికోట కృష్ణ కుమార్, ధర్మ తేజ, విస్డం స్కూల్ సుధాకర్, గుండు సురేష్, రమేష్ రాయల్, మేస్త్రి శంకర్, జంకం శెట్టి హరి తదితరులు పాల్గొనడం జరిగింది.