

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం.
జనం న్యూస్,ఏప్రిల్ 14, భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
, భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో అంగన్వాడి పాఠశాలలో,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్ప మాలలు వేసి టెంకాయలు కోట్టి జై భీమ్ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ దుర్గం సునీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారని . భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ .ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తున్న మాట.ఏప్రిల్ 14వ తేదీన డా.భీమ్రావు అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు గ్రామ గ్రామాలలో నిర్వహించారు. అంబేద్కర్ జీవితం, చదువు,ఆయన ప్రధానంగా ఏ అంశాలపై పోరాడారనే విషయాలను వ్యక్త పరిచారు.బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ లోని మోవ్లో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానంగా జన్మించారు.తండ్రి సుబేదార్ రామ్జీ మాలోజీ సక్పాల్, అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు.బిఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు.అతని తండ్రి పదవీ విరమణ చేసినప్పుడు అంబేద్కర్కు దాదాపు రెండు సంవత్సరాలు మాత్రమే.అతనికి ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయింది. అనంతరం అతని అత్త ఆయనను పెంచింది.
బీఆర్ అంబేద్కర్ విద్యాభ్యాసం
సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తయింది. మెట్రిక్యులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో వివాహం చేసుకున్నారు.దాదాపు 15 సంవత్సరాల వయసులో తొమ్మిదేళ్ల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు.ఆ సమయంలో అమలులో ఉన్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు.ఆ తర్వాత ఎల్ఫిన్స్టోన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బరోడా ఇన్స్టిట్యూట్లో చేరారు.తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లారు.న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీని పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు. అనంతరం 1924లో ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు.దీనికి సర్ చిమన్లాల్ సెతల్వాడ్ అధ్యక్షుడిగా, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. విద్యను వ్యాప్తి చేయడం,ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం ఈ సంఘం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి.ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రిక 1927 ఏప్రిల్ 3న ప్రారంభించారు.ఆ తర్వాత 1928లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి.1935 జూన్ 1వ తేదీన అదే కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేసి 1938లో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు.1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ‘ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ అనే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మత పెద్దలను,కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు.వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.స్వాతంత్ర్యం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం అంబేద్కర్ కాంగ్రెస్ నేతృత్వంలో మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు.రెండు వారాల తరువాత ఆయన భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు.1951లో కశ్మీర్ సమస్య,భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అతను అక్టోబర్ 14,1956 నాగపూర్లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించారు.1948 నుంచి మధుమేహంతో బాధపడుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో నిద్రలోనే తుది శ్వాసను వదిలేశారని చిన్నారులకు వివరించారు,ఈ కార్యక్రమంలో ఆయా రాజలక్ష్మి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
