Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలావేశి, ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమనేని పరశురాం మాట్లాడుతూ..అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు, సైతం మన రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం, బిజెపి మాత్రం భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా పార్లమెంటులో, అవహేళన చేస్తున్నాయి అని అన్నారు. నిండు పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..జై భీమ్, జై భీమ్ అంటుంటే భారతదేశ హోం శాఖ మంత్రి అమీషా, మాత్రం జై భీమ్, జై భీమ్ అంటే ఏమొస్తుంది, జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనండి, మీకు పుణ్యమైన దక్కుతుంది, అని నిండు పార్లమెంట్లో అవహేళన చేయడమే కాకుండా, అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే, ఉంటాయో అక్కడికి వెళ్లి బీజేపీ పార్టీ కార్యకర్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేయమనడం సిగ్గు చేటు, అన్నారు. అదేవిధంగా గతంలో 4 00 పార్లమెంటు స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది అని,తెలిపారు. కానీ ఇలాంటి ఇకా మీదట పునరావృతం, అయితే మాత్రం బిజెపి నాయకులను ఊళ్ళల్లో తిరగనియ్యకుండా, తగిన బుద్ధి చెబుదామని, హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని రక్షించే విధంగా ముందు ముందు అనేక కార్యక్రమాలు తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషర్ మెన్ స్టేట్ కార్యదర్శి పింగిలి రాకేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులు పోల్సాని సాగర్ రావు, మాజీ సర్పంచులు తిరుమల, రాజ్ కుమార్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరివేన శ్రీనివాస్, దొగ్గల భాస్కర్, కొండు బిక్షపతి , బండారి శ్రీధర్, కోరపల్లి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,జంపయ్య శ్రీనివాస్ ,రాజయ్య ,కొండ తిరుపతి, రాజు తదితరులు గ్రామ ప్రజలు నాయకులు వివిధ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.