Listen to this article

జనంన్యూస్.14. నిజామాబాదు సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని తాళ్ల రామడుగు గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సమాజంలో అందరికి సమానంగా స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కులను రాజ్యాంగం అనే పవిత్ర గ్రంధం ధ్వరా ప్రజలందరికి హక్కులను కల్పించిన మహనీయులు డా. బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే నేడు సమాజంలో ప్రజలు కుల, మత, లింగ వివక్షత లేకుండా రాజకీయంగా, సామజికంగా, ఆర్ధికంగా ఉన్నత శిఖరాలను అవరోదిస్తున్నారని అన్నారు. మహనీయుల జయంతిలు, వర్ధంతులు జరుపడానికే పరిమితం కాకుండా నేటి యువతరం అంబేద్కర్ ఆశయసాధనకు, వారి ఆకాంక్షలకు అనుకుంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందేళ్ల శ్రీనివాస్. రామడుగు గ్రామాభివృది కమిటీ సభ్యులు. నాయకులు. యువకులు. పాల్గొన్నారు.