

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ అధ్వర్యంలో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా, స్థానిక జమ్మికుంట మోత్కులగూడెం చౌరస్తా వద్ద అంబేడ్కర్, విగ్రహనికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మండలం లోని, స్పందన ఆనాధ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలతోని కేక్ కట్ చేపించి, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో పండ్లు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక స్పందన ఫౌండేషన్ లో రాచపల్లి సాగర్ మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రక్తదానం చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుల్యాల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు పొడెటి వేణు, జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్, మండల నాయకులు కొలుగురి రవీందర్,కవ్వంపెల్లి నవీన్ ,రాచపల్లి రజినికుమార్,అంబాలా అరుణ్, రాసపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
