Listen to this article

కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య

జనం న్యూస్ 14 ఏప్రిల్ కాసిపేట రవి//

భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున అవడం ఎక్స్ రోడు చౌరస్తాలో, గత మూడు సంవత్సరాల నుంచి విగ్రహం స్థాపన కొరకు ఆరాటపడుతూ చెన్నూరు నియోజవర్గం ఎమ్మెల్యే వివేక వెంకటస్వామికి విన్నవించారు, కాంగ్రెస్ నాయకులు మంతెన సమ్మయ్య ఆధ్వర్యంలో, ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు, దురహంకారంపై అలుపెరుగని పోరాట యోధుడు, సమసమాజ స్వాప్నికుడు దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త, జాతీయవాది, న్యాయకొవిదులు, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారన్నారు.ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఒకరికి, ఒకవర్గానికి చెందిన వారు కాదని ఈ సమాజంలోని ప్రజలందరి వాడని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, ప్రజల హక్కుల కాపాడిన మహోన్నత వ్యక్తి, అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ది కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, జాతీయ ఉద్యమంలో, అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటినుంచి సమాజంలోని అనేకుల చే ఎన్నో అవమానాలు ఎదురైన వెను దిరగక వాటిని దైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి అలంకరించారని .అంబేద్కర్ వీరి జీవిత కాలంలో అనేకు అబ్జెక్టుల లో 32 డిగ్రీలు పొంది, అనేక గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడిగా నిలిచారన్నారు.విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోచించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి, బీ ఆర్ అంబేద్కర్ తన జీవిత చివరన, బుద్ధిని బోధనలు నచ్చి బౌద్ధ మతం స్వీకరించి మహిళా హక్కులు, కార్మికుల హక్కులు, యితర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని సూచించారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈకార్యక్రమం లో మండలo కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామపంచాయతీల కార్యకర్తలు నాయకులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.