Listen to this article

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

కులాంతర వివాహం చేసుకున్న జంటకు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతిని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణానికి చెందిన శ్రీమతి టి.యం. మౌనిక (వైఫ్ ఆఫ్ కె.రమేష్ ) ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నందుకు, ప్రభుత్వ కల్పించిన పథకం ద్వారా 2,50,000 ప్రోత్సాహక బహుమతిని మంజూరైనట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జంటకు బాండ్‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.