Listen to this article

అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం.

గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి.

జనం న్యూస్, ఏప్రిల్ 16, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి):

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాజకీయాలపై తమ అభిప్రాయాలను చూపుతూ ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారిపై అధికారం చలాయించడానికి కాదని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి వినియోగించాలని తెలిపారు. తమ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నన్ని రోజులు తన అధికారాన్ని మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఉపయోగించామని అంతేగాని అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గము నుండి 2019 వ సంవత్సరములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో అఖండ మెజార్టీతో మార్కాపురం ప్రజలు తీర్పు ఎప్పటికీ మరవనిది. మా కుటుంబం 52 సంవత్సరాల రాజకీయ నేపథ్యం వున్న కుందురు కుటుంబం మార్కాపురం నియోజకవర్గ ప్రజలు మా కుటుంబం పై నమ్మకము విశ్వాసముతో అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను కూడా అంతే గౌరవంతో ప్రజా సంక్షేమము, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినాను అని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా రంజికంగా పరిపాలించామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఉన్న నిధులను ఉపయోగిస్తూ వీలైనంతవరకు వారికి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి అధికారులతో సమావేశమై నిధులు ఎంత అవసరమో తెలుసుకొని పలుమార్లు ఆ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అంచలంచెలుగా నిధులు సమకూరుస్తూ ఆ సమస్యలు పరిష్కారం చేయటంలో సఫలీకృతులమైనామని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ కార్యక్రమాలపై నిరంతరము అధికారులతో సమీక్షలు జరుపుతూ, పల్లె ప్రాంతాలలో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుని, అధికారులతో చర్చించి వీలైనంతవరకు ఆ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశామని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గం లోని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే వివిధ ఉన్నత అధికారులపై ఎప్పటికీ తమ అధికారాన్ని చలాయించ లేదని వీలైనంతవరకు వారిని గౌరవిస్తూ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు నిరంతరం అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ప్రజల సమస్యల పట్ల ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులందరిని భాగస్వాములు చేస్తూ వారు సూచనలు సలహాలు తీసుకొని అందరి సహకారంతో మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో తమ వంతు కృషి చేశామని తెలిపారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారి సంక్షేమం కొరకు, వారి ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి, అవినీతి రహిత పాలన కొరకు మాత్రమే మనకు అధికారం ఇస్తారని తెలిపారు. మనము ఎన్ని రోజులు పరిపాలించామనేది ముఖ్యం కాదని మనము అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు నియోజకవర్గానికి మనం చేసే మేలు చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.